| | Cinema Kaburlu | Index
'రాత్రి' వస్తోంది సాయాజీ షిండే, ప్రీతీ మెహ్రా ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'రాత్రి'. చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి సహకారంతో జులై 3న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని సోమవారం హైదరాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో నిర్మాత తెలిపారు.
'ఇది సస్పెన్స్ థ్రిల్లర్. నేడు వస్తున్న థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులను కట్టిపడేసే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి' అని దర్శకుడు తెలిపారు.
ఒక చిన్న నిర్మాతకు వందమంది చిన్న నిర్మాతలు తోడున్నారని చెప్పడానికే చలనచిత్ర పరిరక్షణ సమితి స్థాపించబడిందని, కొత్తగా సినిమాలు తీసే నిర్మాతలకు బడ్జెట్ పై, బిజినెస్ పై అవగాహన ఏర్పరచడానికి సమితి ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వబడుతోందని, చిత్రం విడుదలకు కూడా సహకరించడం జరుగుతుందని, ఇందులో భాగంగా '999' చిత్రాన్ని, రెండవ చిత్రంగా 'రాత్రి'ని విడుదల చేయిస్తున్నామని నట్టి కుమార్, సాగర్లు చెప్పారు. |  |
|
|